రాజధాని అంశంపై పురపాలక మంత్రి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, రాజధాని అమరావతి నుంచి తరలింపు సాధ్యం కాదన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలకు కూడా బొత్స కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చెందడానికి అనువైన నగరం విశాఖపట్నమేనని అన్నారు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని మాత్రమేనని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో రూ.10వేల కోట్లు ఖర్చుచేస్తే హైదరాబాద్ను తలదన్నే రాజధానిగా మారుతుందని తెలిపారు. ఈ ప్రాంతవాసిగా, రాష్ట్ర పౌరుడిగా చెబుతున్నానని, ప్రభుత్వం సహకరిస్తే ఇది సాధ్యమవుతుందని బొత్స పేర్కొన్నారు. రాజధాని మార్పుపై కేంద్రానికి సమాచారం అందజేస్తామని, వారితో సత్సంబంధాలు కొనసాగించి, అభివృద్ధికి సహకరించాలని కోరతామని అన్నారు. అంతేకాదు, విశాఖ ఉత్సవ్లో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడనంత మాత్రాన వెనకడుగు వేసినట్లు కాదని స్పష్టం చేశారు. రాజధాని అంశంపై మాట్లాడేందుకు ఉత్సవ వేదిక సరైంది కాదని, అదేరోజు విశాఖ జనం ఆయనకు ఘన స్వాగతం పలికిన విషయం కనిపించలేదా అని బొత్స ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసమే అమరావతిని చందబ్రాబు రాజధానిగా గుర్తించారని, అప్పట్లో జరిగిన లొసుగులను సవరించేలా హైపవర్ కమిటీ నివేదిక ఉంటుందని వెల్లడించారు. రాజధాని మారదని సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో స్పందించిన బొత్స... ఆయన మాటలు శాసనం, వేదం కాదన్నారు. రాజధాని మారదని ఆయనకేమైనా ప్రధాని మోదీ చెవిలో చెప్పారా అని ఎద్దేవా చేశారు. సుజనా చౌదరిని చంద్రబాబు తొత్తుగా అభివర్ణించారు. టీడీపీ నేత అశోక్గజపతి రాజు కేంద్రమంత్రిగా ఉండి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రాజెక్టూ తీసుకురాలేకపోయారని, రాజధాని అంశంపై ఆయన తన వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. రాజధానిపై ప్రకటన రాకముందే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు వివరాలిస్తే విచారణ చేపట్టేందుకు తాము సిద్ధమేనని బొత్స అన్నారు. అమరావతి సమీపంలోని 498 ఎకరాల భూమిని చంద్రబాబు బంధువుల పేరిట టీడీపీ ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించిందని.. రెండు నెలల తర్వాత ఆ ప్రాంతాన్ని సీఆర్డీఏలో కలిపారని, అది ప్రజాధనం దోపిడీ కాదా అని నిలదీశారు.
https://ift.tt/37hn9Fh
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2ZBvuB0
No comments:
Post a Comment