కొండెక్కి కూర్చుంది. పరుగులు పెడుతూనే వస్తోంది. ఈ రోజు కూడా బంగారం ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరుగుదల కారణంగా మన దేశంలోనూ పసిడి ధర పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర పెరిగితే ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.510 పెరుగుదలతో రూ.45,810కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా రూ.840 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.42,500కు ఎగసింది. Also Read: పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర రూ.110 పెరిగింది. దీంతో వెండి ధర రూ.42,530కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కు 0.02 శాతం పైకి కదిలింది. దీంతో ఔన్స్కు 1745.65 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. వెండి ధర ఔన్స్కు 0.01 శాతం తగ్గుదలతో 15.35 డాలర్లకు క్షీణించింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.230 పెరుగుదలతో రూ.43,000కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.410 పెరుగుదలతో రూ.45,910కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.110 పెరిగింది. దీంతో ధర రూ.42,530కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
https://ift.tt/3ayWyob
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3aD0Taa
No comments:
Post a Comment