గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15 నుంచి ఆర్టీసీ ఆన్లైన్ రిజర్వేషన్లు మొదలయ్యాయి. ఈ నెల 14తో లాక్డౌన్ ముగిస్తుందని.. తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ రెడీ అయ్యింది. అందుకే ఆన్లైన్ రిజర్వేషన్లను ప్రారంభించింది. బస్సుల విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులను నడపకూడదని నిర్ణయించారు. ప్రస్తుతానికి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రిజర్వేషన్లు మాత్రమే ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించి 90% నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. విజయవాడ బస్టాండ్ నుంచి నాన్ ఏసీ సర్వీసులను మాత్రమే ఆర్టీసీ ప్రారంభించనుంది. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవి మాత్రం ఏసీ సర్వీసులను నడపనున్నారు. కరోనా వైరస్ ఏసీలో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దశలవారీగా ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్కు ఈనెల 15వ తేదీన 115 సర్వీసులకు టిక్కెట్ బుకింగ్స్ అందుబాటులో తీసుకురాగా.. వీటిల్లో ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవి 10 ఏసీ బస్సులే ఉన్నాయి. మిగిలిన 105 సర్వీసులు సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే. బెజవాడ నుంచి తిరుపతికి 45 సర్వీసులు నడపనున్నారు. వీటిల్లో కేవలం ఐదు మాత్రమే ఏసీ సర్వీసులు ఉన్నాయి. చెన్నైకు మూడు సర్వీసులు ఉంటే.. రెండు సూపర్ లగ్జరీ కాగా ఒకటి ఏసీ సర్వీసు ఉంది. అదీ కూడా కాకినాడ డిపో బస్సు.
https://ift.tt/3bUP00d
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3c5Dnnt
No comments:
Post a Comment