భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ భవితవ్యాన్ని ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చనుంది. సుప్రీంకోర్టు నియమిత లోధా కమిటీ రూపొందించిన కొత్త బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఈ నెల 27న బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ముగియనుంది. కానీ.. ఇటీవల బోర్డు రాజ్యాంగానికి అనేక సవరణలు చేసిన బీసీసీఐ పెద్దలు.. పర్మీషన్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే.. విచారణని సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదావేసింది. గంగూలీతో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షాది కూడా అదే పరిస్థితి. అసలు సమస్య ఏంటంటే..? లోధా కమిటీ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం.. బీసీసీఐ లేదా రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఒక వ్యక్తి రెండు పర్యాయాలకి మించి పదవిలో ఉండటానికి వీల్లేదు. మూడేళ్ల చొప్పున ఆ పదవీకాలం ఉండగా.. రెండు పర్యాయాల తర్వాత కనీసం మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం తప్పనిసరి. ఇక గంగూలీ విషయానికి వస్తే.. బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీ 2015 నుంచి 2019 వరకూ పనిచేశాడు. ఆ వెంటనే గత ఏడాది బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంటే.. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా క్యాబ్, బీసీసీఐ పదవుల్లో దాదా కొనసాగుతున్నాడన్నమాట. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం గంగూలీ పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణకి ఒప్పుకుంటే అప్పుడు గంగూలీ సుదీర్ఘకాలం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగగలడు. బీసీసీఐ సెక్రటరీ జై షా పదవీ కాలం అయితే గత మే నెలలోనే ముగిసిపోవడం గమనార్హం.
from క్రికెట్ వార్తలు: Latest India Cricket News, Today Match Score, Highlights | Samayam Telugu https://ift.tt/2ZPcjW8
No comments:
Post a Comment