భారత్ జట్టులో అతని తీరుతో హడలిపోయా: కపిల్‌దేవ్ - "Current Bits of knowledge Center"

"Current Bits of knowledge Center"

Welcome to the "Current Bits of knowledge Center," your go-to objective for remaining educated and motivated. Jump into the most recent news, provocative examinations, and convincing stories from around the globe. Our group of prepared writers and givers present to you a different scope of themes, covering all that from making it known and inside and out highlights to social patterns and mechanical developments. Investigate the world from our perspective and join the discussion on the issues tha

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 15 July 2020

భారత్ జట్టులో అతని తీరుతో హడలిపోయా: కపిల్‌దేవ్

భారత దిగ్గజ క్రికెటర్ల గురించి ప్రస్తావన వస్తే..? కపిల్‌దేవ్‌ కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. కెప్టెన్‌గా 1983లో భారత్‌కి తొలిసారి ప్రపంచకప్‌ని అందించిన కపిల్‌దేవ్.. ఆల్‌రౌండర్‌గా సుదీర్ఘకాలం జట్టులో కొనసాగాడు. ఈ క్రమంలో ఎంతో మంది బౌలర్లని ఎదుర్కొని పరుగులు రాబట్టిన కపిల్.. ఎందరో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కి పంపించాడు. కానీ.. కెరీర్ ఆరంభంలో ఒక క్రికెటర్‌ అంటే తనకి విపరీతమైన భయం ఉండేదని తాజాగా కోచ్ డబ్ల్యూ‌వీ రామన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ క్రికెటర్ ప్రత్యర్థి టీమ్ ఆటగాడు కాదు.. భారత్ జట్టు ఒకప్పటి కెప్టెన్ శ్రీనివాస్ వెంకట్రాఘవన్ అని కపిల్‌ బాంబ్ పేల్చాడు. అప్పట్లో అతనంటే హడిపోయేవాడినని చెప్పుకొచ్చిన కపిల్‌దేవ్.. భయంతో నక్కినక్కి బ్రేక్‌ఫాస్ట్ చేసేవాడినని గుర్తు చేసుకున్నాడు. ‘‘అప్పట్లో ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో సాయంత్రం చిన్న టీ బ్రేక్ ఇచ్చేవారు. దానిపై కూడా వెంకట్రాఘవన్ వాదనకి దిగేవాడు. ఎందుకు టీ బ్రేక్ అని పిలవాలి..? కాఫీ బ్రేక్ ఎందుకు కాకూడదు ఇలా ఉండేది అతని వాదన. ఫస్ట్ అతను ఇంగ్లీష్‌లోనే మాట్లాడేవాడు.. సెకండ్ అతనికి చాలా కోపం ఎక్కువ. దాంతో.. అతనిని చూస్తేనే నాకు భయం వేసేది. ఆఖరికి అతను అంపైర్‌గా మారిన తర్వాత కూడా నాటౌట్ అని ఇస్తే..? అదేదో బౌలర్‌ని తిట్టినట్లుండేది. 1979 ఇంగ్లాండ్ పర్యటనలో అతనికి కనిపించకుండా దాక్కునేవాడ్ని. బిషన్‌ సింగ్ బేడీ, ప్రసన్న, చంద్రశేఖర్ తదితరుల్ని చూస్తే అతను ఏమీ అనేవాడు కాదు. కానీ.. నన్ను చూడగానే నోటికి పనిచెప్పేవాడు. దాంతో.. ఓ మూల నక్కి బ్రేక్‌ఫాస్ట్ చేసేవాడ్ని. అది చూసి.. ఇతను ఎప్పుడూ తింటూనే ఉంటాడా..? అని అరిచేవాడు’’ అని కపిల్‌దేవ్ గుర్తుచేసుకున్నాడు. బిషన్ సింగ్ బేడీ కెప్టెన్సీలో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కపిల్‌దేవ్.. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో కూడా ఆడాడు. కానీ.. వెంకట్రాఘవన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మాత్రం తాను కాస్త ఇబ్బందిపడినట్లు ఈ దిగ్గజ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. 1960-1970లో భారత్ స్పిన్నర్‌గా అప్పట్లో నిలకడగా రాణించిన వెంకట్రాఘవన్ 57 టెస్టుల్లో 156 వికెట్లు పడగొట్టి.. 1983లో రిటైర్మెంట్ ప్రకటించాడు.


from క్రికెట్ వార్తలు: Latest India Cricket News, Today Match Score, Highlights | Samayam Telugu https://ift.tt/2B1vEcY

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages