ఇంగ్లాండ్ టూర్లో పాకిస్థాన్కి మెరుపు ఆరంభం లభించింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్.. ఓపెనర్ షాన్ మసూద్ (156 బంతుల్లో 18x4, 2x6) సెంచరీ బాదడంతో 326 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్థాన్ ఓపెనర్ ఎట్టకేలకి టెస్టు సెంచరీ నమోదు చేయగలిగాడు. ఆఖరిగా 1996లో ఓపెనర్ సయీద్ అన్వర్ అక్కడ శతకం సాధించాడు. ఆటలో రెండో రోజైన గురువారం పాకిస్థాన్ 326 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్.. ఆట ముగిసే సమయానికి 92/4తో కష్టాల్లో నిలిచింది. ఓపెనర్ రోర్ బర్న్స్ (4), డొమినిక్ సిబ్లే (8). జో రూట్ (14), బెన్స్టోక్స్ (0) తక్కువ స్కోరుకే పెవిలియన్కి చేరిపోయారు. ప్రస్తుతం క్రీజులో ఓలీ పోప్ (46 బ్యాటింగ్: 67 బంతుల్లో 6x4), జోస్ బట్లర్ (15 బ్యాటింగ్: 27 బంతుల్లో 2x4) ఉండగా.. ఇంగ్లాండ్ ఇంకా 234 పరుగులు తొలి ఇన్నింగ్స్లో వెనకబడి ఉంది. వాస్తవానికి ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో పాకిస్థాన్ ఈ తరహాలో ఆధిపత్యం చెలాయిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. మసూద్ వీరోచిత శతకం బాదగా.. బాబర్ అజామ్ (69: 106 బంతుల్లో 11x4) గట్టిగా పోరాడాడు. దాంతో.. తొలుత మెరుగైన స్కోరుని అందుకున్న పాకిస్థాన్.. ఇప్పుడు బౌలింగ్లోనూ మహ్మద్ అబ్బాస్ (2/24), షాహీన్ అఫ్రిది (1/12), యాసిర్ షా (1/36) రాణించడంతో ఇంగ్లాండ్ని ఒత్తిడిలోకి నెట్టగలిగింది. ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ని పాక్ ఆడనుంది.
from క్రికెట్ వార్తలు: Latest India Cricket News, Today Match Score, Highlights | Samayam Telugu https://ift.tt/31qNSOm
No comments:
Post a Comment