తెలంగాణ మంత్రి కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. మంత్రిగారి సతీమణి శ్రీనిత పాల వ్యాపారం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె పాల ఉత్పత్తుల్ని శుక్రవారం ఆవిష్కరించారు. మిల్చి మిల్క్ పేరుతో పాల ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు ఇందుకు తగానో దోహదపడతాయన్నారు శ్రీనిత. చిల్లింగ్ కేంద్రాలు, బల్క్ కూలర్లు, ప్యాకింగ్ స్టషన్ల ద్వారా సరఫరా మార్గాలపై కఠినమైన నియంత్రణతో పాల ఉత్తత్తులు చేపడుతున్నట్లుగా తెలిపారు. వినియోగదారుల ఇంటి వద్దకే తాజా, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను పంపిణీ చేస్తామన్నారు. హరీష్ రావు ప్రస్తుతం సిద్ధిపేట నియోజకవర్గానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు భార్య ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. Read More: 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించి, 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
https://ift.tt/3j91ViV
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2YF5aa3
No comments:
Post a Comment