కరోనా వైరస్.. 22 రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు జాతీయ సగటు కంటే తక్కువ - "Current Bits of knowledge Center"

"Current Bits of knowledge Center"

Welcome to the "Current Bits of knowledge Center," your go-to objective for remaining educated and motivated. Jump into the most recent news, provocative examinations, and convincing stories from around the globe. Our group of prepared writers and givers present to you a different scope of themes, covering all that from making it known and inside and out highlights to social patterns and mechanical developments. Investigate the world from our perspective and join the discussion on the issues tha

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 8 October 2020

కరోనా వైరస్.. 22 రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు జాతీయ సగటు కంటే తక్కువ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనలు మేరకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి రోజూ పది లక్షల మందిలో 140 మందికిపైగా నమూనాలను పరీక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో టెస్టింగ్ జరగడంతో పాజిటివ్ రేటు తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. గత 11 రోజుల నుంచి దేశవ్యాప్తంగా పాజిటివ్ రేటు 8.2 శాతం మేర తగ్గిందని తెలిపింది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో పాజిటివ్ రేటు 5 శాతం కంటే తక్కువ ఉందని పేర్కొంది. ఇదే సమయంలో 22 రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని, దేశంలోని చాలా ప్రాంతాల్లో వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనడానికి ఇది సంకేతమని వివరించింది. దేశంలో ప్రతి రోజూ సగటున పది లక్షల మందిలో 865 మందికి చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ భారత్‌లో మిలియన్ జనాభాకు 60,323 పరీక్షలు నిర్వహించగా.. అమెరికాలో 344,858, బ్రెజిల్‌లో 84,051 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. బిహార్, మిజోరాం, గుజరాత్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌‌లో పాజిటివ్ రేటు 5 శాతం కంటే తక్కువ ఉంది. గత ఆరు నెలలుగా దేశంలో టెస్టింగ్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్తంగా 1900 ల్యాబొరేటరీలు ప్రభుత్వ, ప్రయివేట్ విభాగాల్లో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 15 లక్షల మంది నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. బుధవారం 11,94,321 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకూ 8.34 కోట్ల మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. పెద్ద సంఖ్యలో టెస్టింగ్ జరగడం వల్ల ముందుగానే పాజిటివ్ కేసులను గుర్తించి, సమర్ధవంతమైన చికిత్సను అందజేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బాధితులను సకాలంలో గుర్తించి చికిత్స అందజేయడంతో మరణాలు రేటు తక్కువగా నమోదయ్యిందన్నారు. బాధితులు కూడా పెద్ద సంఖ్యలో కోలుకున్నారని, యాక్టివ్ కేసులు వరుసగా 17వ రోజు 10 లక్షలలోపు ఉన్నాయని తెలిపారు. బుధవారం దేశవ్యాప్తంగా 78,524 కేసులు నమోదుకాగా.. అదే రోజు 83,011 మంది బాధితులు కోలుకోవడం సానుకూలంశం. అయితే, కరోనా వైరస్‌ను తొలినాళ్లలో సమర్ధంగా ఎదుర్కొని కట్టడిచేసిన కేరళలో మాత్రం కేసులు భారీగా నమోదుకావడం ఆందోళనకరం. బుధవారం ఏకంగా 10వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తర్వాత 10వేల కేసులు నమోదయిన నాలుగో రాష్ట్రంగా కేరళ నిలిచింది.


from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/3jMqtif

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages