అతిపెద్ద ఆదివాసీ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభానికి ముందే జనంతో కోలాహలంగా తయారైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. మేడారం జాతరకు వెళ్లేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించింది. హెలి టూరిజంలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచి హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఈ రోజు బేగంపేట విమానాశ్రయం హెలికాప్టర్కి పచ్చజెండా ఊపి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలి రైడ్ను ప్రారంభించారు. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హన్మకొండ తదితర పట్టణాల నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు నడపనున్నారు. హెలి రైడ్ సేవలకు సంబంధించిన బ్రోచర్ను మంత్రి ఆవిష్కరించారు. టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టూరిజం ఎండీ మనోహర్, రాష్ట్ర ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, టూరిజం అధికారులతో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మేడారానికి హెలికాప్టర్ లో వెళ్లేందుకు పర్యాటకులు 09880505905 నంబర్కు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాలని మంత్రి సూచించారు. హెలికాప్టర్ రైడ్ షెడ్యూల్, ధరలు. మేడారానికి హెలికాప్టర్ సేవలు: ఫిబ్రవరి 20 వరకూ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హెలికాప్టర్ జాయ్ రైడ్ : 7,8 నిమిషాలు మేడారం నుంచి వ్యూ కోసం ఒక్క వ్యక్తి కి రూ.3700 మేడారం షటిల్ సర్వీస్: రైడ్ 20 నిమిషాల వన్ వే హన్మకొండ నుంచి మేడారం షటిల్ సర్వీస్ ఒక్క వ్యక్తి కి రూ.19.999 కరీంనగర్ నుంచి మేడారం ఒక్కరికి రూ.75,000 హైదరాబాద్ నుంచి మేడారానికి రూ.75.000 మహబూబ్ నగర్ నుంచి మేడారానికి రూ.100.000. Also Read:
https://ift.tt/vBUgjmw
from తెలుగు వార్తలు | Telugu Latest News | Online Telugu News | News in Telugu | Samayam Telugu https://ift.tt/ykUtSeO
No comments:
Post a Comment