క్రికెట్ బోర్డులో మళ్లీ దుమారం రేగింది. ఆరేళ్ల క్రితం ఆర్థికంగా చితికిపోయిన ఆ బోర్డుకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేసింది. కానీ.. దాన్ని కూడా ఆ బోర్డు అధికారులు దుర్వినియోగం చేసినట్లు తాజాగా ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ మైకేల్ హోల్డింగ్ ఆరోపించాడు. అప్పట్లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్లని ఆదుకునేందుకు హాఫ్ మిలియన్ డాలర్లని విండీస్ బోర్డుకి బీసీసీఐ అందజేసింది. Read More: 2014లో భారత్ పర్యటనకి వచ్చిన కరీబియన్ జట్టు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల మధ్య జీతాల విషయంలో వివాదం చెలరేగడంతో టూర్ నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయింది. దాంతో ఆగ్రహించిన బీసీసీఐ.. విండీస్ క్రికెట్ బోర్డు 41.97 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని దావా వేసింది. కానీ.. తమకి అంత ఆర్థిక స్థోమత లేదని విండీస్ బోర్డు అప్పట్లో ప్రాథేయపడటంతో బీసీసీఐ వదిలేసింది. ఆ తర్వాత కూడా విండీస్ బోర్డులో మార్పు రాలేదు. Read More: వాస్తవానికి 2013-14లోనే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకి హాఫ్ మిలియన్ డాలర్లని బీసీసీఐ విరాళంగా అందజేసినట్లు తాజాగా ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ హోల్డింగ్ వెలుగులోకి తీసుకొచ్చాడు. ఓ యూట్యూబ్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని ఈ పేసర్ చెప్పుకొచ్చాడు. ‘‘వెస్టిండీస్ మాజీ క్రికెటర్లని ఆదుకునేందుకు 2013-14లో హాఫ్ మిలియన్ డాలర్లని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకి బీసీసీఐ విరాళంగా అందజేసింది. నేను కూడా మాజీ క్రికెటర్నే.. కానీ ఆ డబ్బు నాకు వద్దు.. రాలేదు కూడా. అయితే.. ఇప్పటి వరకూ కనీసం ఒక్క మాజీ క్రికెటర్ కూడా ఆ డబ్బు తమకి చేరింది అనే మాటని నేను వినలేదు. మరి ఆ హాఫ్ మిలియన్ డాలర్లు ఏమైనట్లు..? త్వరలోనే అన్ని వివరాలు బహిర్గతం చేస్తాను’’ అని హోల్డింగ్ వెల్లడించాడు.
from క్రికెట్ వార్తలు: Latest India Cricket News, Today Match Score, Highlights | Samayam Telugu https://ift.tt/3bKDIep
No comments:
Post a Comment