తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇతర రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలంటూ వారందరూ ఆకాంక్షించారు. అయితే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసీఆర్కు శుభాకాంక్షలు చెబుతూ చేసి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్పై సోమిరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. తన మిత్రుడు తెలంగాణ సీఎం కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు అని చెబుతూ.. ఒక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక అభినందనలు అని చెప్పారు. రైతుకు ఎన్ని ఎకరాలున్నప్పటికీ ప్రతి ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి సాయం చేస్తూ అమలు చేస్తున్న రైతుబంధు పథకం అద్భుతమని ఆయన పొగిడారు. అంతేకాకుండా 'దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటలూ విద్యుత్ సరఫరా కూడా మీకే సాధ్యమైంది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించబోమని కూడా ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ఈ విషయాల్లో ఇతర రాష్ట్రాల సీఎంలు మిమ్మల్ని స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది..' అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.
https://ift.tt/19dMgl8
from తెలుగు వార్తలు | Telugu Latest News | Online Telugu News | News in Telugu | Samayam Telugu https://ift.tt/GhufZqi
No comments:
Post a Comment